రేపు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారు అయింది. రేపు తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనుననారు. ఈ తరుణంలోనే, కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.

అనంతరం.. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి లో పాల్గొంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాగా, అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ లో జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ విస్సన్నపేట భూ కుంభకోణం పై జగనన్నకి చెబుదాం అంటూ నిరసన కు దిగింది. ఈ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డికి జనసేన నాయకులు డిమాండ్ చేశారు. అనకాపల్లిలో వైసీపీ నవ మోసాలు కరపత్రాలు విడుదల చేశారు జనసేన నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news