పవన్‌ కళ్యాణ్ సంచలన నిర్ణయం..దసరా రోజు నుంచి యాత్ర !

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ సంచలన నిర్ణయం..తీసుకున్నాడు. దసరా రోజు నుంచి భారీ యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జనసేన కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగనుంది. ఈ కార్యక్రమంలో… పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొననున్నారు.


పార్టీ లీగల్ సెల్ కి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్‌ చేపట్టబోయే రాష్ట్ర యాత్ర ఏర్పాట్ల పై ఈ సందర్భంగా సమాలోచనలు చేయనున్నారు నేతలు.

దసరా రోజు నుంచి యాత్ర చేపట్టాలని గతంలో నిర్ణయించిన పవన్… యాత్ర కొన్నాళ్ల పాటు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాత్రకు ఇంకా పూర్తి ఏర్పాట్లు కాలేదు. పార్టీ ముఖ్యులతో మరోసారి చర్చించి క్లారిటీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్‌.. ఈ యాత్రపై కీలక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది. ఎలాగైనా.. దసరా నుంచే ఈ యాత్రను ప్రారంభించాలని పవన్‌ ఆలోచిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news