ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ సెటైర్ !

-

సినీ పరిశ్రమలో దిక్కర స్వరం ముందు నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్కడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన భారతీయ జనతా పార్టీని గత కొంతకాలం నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన నమీబియా నుంచి రప్పించిన 8 చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో పార్కులో మోడీ చేతులతో వదిలిపెట్టారు. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ మోడీని టార్గెట్ చేస్తూ శనివారం రాత్రి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

అడవులలో తిరిగే చీతాలను రప్పించారు.. మరి బ్యాంకుల నుంచి వేలాది కోట్లు రుణాలు తీసుకొని దేశ ప్రజలను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వారిని ఎప్పుడు రప్పిస్తారు? అనే అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టారు. ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. తాను చెప్పే చీతాలు ఇవేనంటూ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మొహుల్ చొక్షి ల ఫోటోలను ఆయన ట్వీట్ కి జత చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news