పిఠాపురంలో వేడేక్కిన రాజకీయాలు…గీతా పేరుతో బరిలో ముగ్గురు మహిళలు…!

-

కాకినాడ పిఠాపురం నియోజక వర్గంలో ప్రచారం వేడెక్కింది. పిఠాపురం నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తున్న తరుణంలో… అందరి దృష్టి అక్కడే పడింది. అయితే.. తాజాగా పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు గీత గంగాభవాని, గీత దేవి అనే ఇద్దరు మహిళలు.

Politics heated up in Pithapuram

గీత గంగా భవాని ,పవన్ కళ్యాణ్ లకు ఒకే లాయర్ నోటరీ చేయడం ఏంటని గీత గంగాభవానికి ఫోన్ లు వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ అయ్యాయి. కడప నుంచి రాజ గోపాల్ రెడ్డి ఫోన్ చేసినట్లు కాల్ రికార్డ్ ఉంది. తనకు చాలా ఫోన్ లు వస్తున్నాయని చెప్తున్నారు గీతా గంగా భవాని. అయితే.. ఇప్పటికే వైసీపీ పార్టీ అభ్యర్థిగా వంగ గీతా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు గీతాలు వచ్చారు. ఇలా జరిగితే.. వైసీపీ పార్టీకి నష్టం అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version