శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఇవాళ తిరుపతిలో అంగరంగ వైభవంగా ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇందుకోసం చిత్రబృందం ఇప్పటికే తిరుపతి చేరుకుంది. నిన్న హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్.. రాత్రి పూట తిరుపతికి వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. పంచె కట్టులో సంప్రదాయ పద్ధతిలో ప్రభాస్.. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ఆలయ అర్చకులు ప్రభాస్​కు ఘనస్వాగతం పలికారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ప్రభాస్.. అనంతరం గెస్ట్ హౌజ్​కు వెళ్లాడు. ప్రభాస్​ను చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.

ఇవాళ సాయంత్రం 5 గంటలకు శ్రీవారి పాదాల కింద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని రీతిలో ఈ ప్రీ రిలీజ్ వేడుక జరగునుంది. సంగీత ద్వయం అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటను లైవ్ గా ప్రదర్శించబోతున్నారు. చిన్న జీయర్ స్వామి గెస్ట్ గా రానున్న ఈ ప్రీ రిలీజ్ వేడుకలో యాక్షన్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news