బ్రేకింగ్: జగన్ కు ఫోన్ చేసిన ప్రధాని, హోం మంత్రి…!

-

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సిఎం వైఎస్ జగన్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేసారు. తన ఆలోచనలు అన్నీ కూడా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతో నిండి ఉన్నాయని అన్నారు. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడీ అన్నారు.

ప్రస్తుత పరిస్థితిని ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించా అని అయన పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు కూడా తమ నుంచి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. 50 లక్షల ఆర్ధిక సాయం చేసినట్టు జగన్ ప్రధానికి వివరించారు. హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధానికి ఫోన్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం కేంద్రం చేస్తుందని ఆయన అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్దిస్తున్నట్టు ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news