సింహాద్రి అప్పన్న భక్తుల జోలికి వెళ్ళవద్దు – జగన్ కు RRR వార్నింగ్

-

సింహాద్రి అప్పన్న భక్తుల జోలికి వెళ్ళవద్దని ఏపీ సీఎం జగన్ కు RRR వార్నింగ్ ఇచ్చారు. సింహాద్రి అప్పన్న భక్తుల దేవుడని, సింహాద్రి అప్పన్న ఆగ్రహానికి గురైన హిరణ్యకశిపుడుకి ఏ గతి పట్టిందో, ఆయన భక్తుల జోలికి వెళితే మన పార్టీకి కూడా అదే గతి పడుతుందని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.

హిందూ భక్తులపై ప్రజలు చెబుతున్నట్లుగా పాలకులకు ద్వేష భావాలు ఉండి ఉంటే, పార్టీలోని సభ్యులు చేసిన తప్పు కాదని, సింహాద్రి కొండపై జరిగిన దోషాలతో తమ పార్టీ సభ్యులకు సంబంధం లేదని, పార్టీ సభ్యులపై నరసింహ స్వామి ఆగ్రహం వ్యక్తం చేయవద్దని అన్నారు. ఇప్పటికే ఎన్నో చందనోత్సవాలు జరిగాయని, ఈసారి కూడా వాటంత వాటిని వదిలేసి ఉంటే సజావుగానే సాగి ఉండేవని, భక్తులకు అన్యాయం చేసింది ఎవరో స్వరూపానంద స్వామి గారు చెప్పకనే చెప్పారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news