ఏపీ హైకోర్టులో నారా లోకేష్ కి ఊరట

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఏపీ హైకోర్టులో ఉరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో సూర్యరావుపేటలో లోకేష్ పై పెట్టిన కేసును హైకోర్టు ధర్మాసరం నేడు కొట్టివేసింది. 2021 జూన్ లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని పోలీసులు అరెస్టు చేసి శ్రీకాకుళం జిల్లాలోని ఆయన నివాసం నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించిన సంగతి తెలిసిందే.

అయితే అచ్చెన్నాయుడును విజయవాడ సిటీ కోర్టులో పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్ పై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. లోకేష్ తరపున సీనియర్ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పును విలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news