చంద్రబాబుకు సజ్జల ఛాలెంజ్..నిరూపిస్తే క్షమాపణ చెబుతా

-

చంద్రబాబుకు సజ్జల ఛాలెంజ్ విసిరారు. తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే క్షమాపణ చెబుతానని తెలిపారు. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీకి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోరుగా సాగుతున్న లే అవుట్ పనులు కొనసాగిస్తోంది. ఇక ఇవాళ లే అవుట్ పనుల పురోగతిని పరిశీలించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల.

ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో ఎక్కడ భూమి ఇచ్చాడో చెప్పాలి.. ఒక సెంటు ఇచ్చినా చూపించమని అడుగుతున్నామని తెలిపారు. చూపిస్తే స్వయంగా క్షమాపణ చెబుతామని సవాల్‌ చేశారు. చూపించలేకపోతే.. నేను అబద్దాలు చెప్పానని చంద్రబాబు ఓపెన్ గా అంగీకరించాలని పేర్కొన్నారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news