BREAKING : నేటి నుంచి బెజవాడలో శ్రీలక్ష్మి మహా యజ్ఞం..ఈ నెల 17 వరకు

-

BREAKING : నేటి నుంచి బెజవాడలో శ్రీ లక్ష్మి మహా యజ్ఞం ప్రారంభం కానుంది. బెజవాడలో శ్రీలక్ష్మి మహా యజ్ఞం నేటి నుంచి 17 వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందిరా గాంధీ స్టేడియం లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక ఈ తరుణంలోనే ఈ శ్రీ లక్ష్మి మహా యజ్ఞం ప్రారంభానికి సీఎం జగన్‌ రానున్నారు.ఇందులో భాగంగానే, ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంకు వెళ్ళనున్న సీఎం జగన్… శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news