BREAKING : TRS ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఎంపీ రఘురామకు నోటీసులు !

-

BREAKING : మొయినాబాద్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసేందుకు యత్నించిన రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

అయితే, తాజాగా TRS ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు జారీ అయ్యాయి. ఫామ్హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఆంధ్రా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సిట్ నోటీసులు ఇచ్చారు. అంతేకాదు, విచారణకు హాజరు కావాలని 41A కింద సీఆర్పీసి నోటీసులు జారీ చేసింది. 100 కోట్ల రూపాయలు సమకూరుస్తానని చెప్పినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news