ప్రధాని సభకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంపై సోము వీర్రాజు క్లారిటీ

-

ప్రధాని సభకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంపై సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మొన్న ఒక వీడియో సందేశం పంపారని… జనసేన శ్రేణులు ప్రధాన మంత్రి సభను జయప్రదం చేయమని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. జనసేన బీజేపీతో కలిసే ఉంది అందులో సందేహం లేదని సోము వీర్రాజు తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.

నిన్న ప్రధాన మంత్రి పర్యటన బాగా జరిగిందని.. ఏపీలో ఉన్న పార్టీలకు వారి కుటుంబాలు మాత్రమే కావాలన్నారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అభివృధి కావాలి.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం శక్తిగా బీజేపీ ఎదుగుతుందని పేర్కొన్నారు సోము వీర్రాజు. యువతకు ఉద్యోగాలిస్తామని జగన్ హామీ ఇచ్చారు… టీచర్లు, పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం‌ అన్నారన్నారు.

కాంట్రాక్టు, ఔటట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని చెప్పారని.. అన్ని వర్గాల వారికి నేనున్నాని చెప్పి ఓట్లు వేయించుకున్నారని సోము గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ తీరు వల్ల అందరూ నష్టపోయారని.. ప్రధాని పర్యటనలో‌ నల్ల బెలూన్లు ఎగరేయడం సరైన విధానం కాదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news