రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం నుంచే పోటీ చేస్తా – తీగల కృష్ణారెడ్డి

-

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తీగల కృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో నేను పుట్టి పెరిగిన మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తాను సీఎం కేసీఆర్ తోనే ఉంటాని… నేను మంత్రి పదవి తప్ప మిగతా అన్ని పదవులు చూశానని వెల్లడించారు.

నేను ఆషామాషీ వ్యక్తిని కాదు…. సబితా ఇంద్రారెడ్డి వైపు నుంచే నేను పార్టీ మారుతున్న అనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తీగల కృష్ణారెడ్డి. మీర్పేట అభివృద్ధి జరగడం లేదనే నా ఆవేదన అని.. స్కూల్స్, చెరువుల్లో శంకుస్థాపనలు చేయాల్సిన అవసరం ఏంటి ? అని నిలదీశారు తీగల కృష్ణారెడ్డి.

కేసీఆర్ ను అడిగితే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించరా? కేటీఆర్ తో అన్ని అంశాలపై చర్చించానని పేర్కొన్నారు తీగల కృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టికెట్‌ ఇస్తే.. టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని స్పష్టం చేశారు తీగల కృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news