కొడుకు తొలి చూపు, భర్త చివరి చూపు… విషాద మహిళ…!

-

దరిద్రం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. ఎలా వచ్చి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో కూడా అర్ధం చేసుకోవడం చాలా కష్టం. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి మండలం లో జరిగిన ఒక ప్రమాదం నిజంగా కన్నీరు పెట్టిస్తుంది. కొడుకు పుట్టిన కాసేపటికే తండ్రి ప్రమాదవ శాత్తు మరణించాడు. ఎవరినో కాపాడబోయి ఆ విధంగా మరణించాడు తండ్రి. ఈ ఘటన ఇప్పుడు ప్రకాశం జిల్లాలో విషాదంగా మారింది.

ప్రకాశం జిల్లా దర్శి మండలంలో అబ్బాయిపాలే౦ గ్రామానికి చెందిన 23 ఏళ్ళ అజయ్ రెడ్డికి గత ఏడాది వివాహం జరిగింది. భార్యకి నెలలు నిండి దర్శి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఆమె ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది. ఇక భర్త అజయ్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నారు. అయితే అతను సరదాగా తన స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి గానూ ముండ్లమూరు మండలం రెడ్డినగర్ సమీపంలోని సాగర్ కాల్వకి వెళ్ళాడు.

ఈ సమయంలో అక్కడ ఒక ప్రమాదం జరిగింది. కాల్వలో దిగిన స్నేహితులు మునిగిపోవడం చూసాడు అజయ్. వెంటనే వారిని కాపాడాలి అని భావించాడు. కాలవలో ఉన్న పూడులో ఇరుక్కుపోయిన అతను ఊపిరాడక అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనితో అతని స్నేహితులు షాక్ లో అక్కడి నుంచి పారిపోయారు. బంధువులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అతన్ని చూసి బోరున విలపించారు. కొడుకుని కూడా చూసుకోలేకపోయాడు ఆ తండ్రి.

Read more RELATED
Recommended to you

Latest news