పోలవరం ప్రాజెక్టు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్

-

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్జీటీ సంయుక్త కమిటీ విధించిన పరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులో అన్ని అంశాలు యథాతథంగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. రూ.250 కోట్ల పరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని.. అప్పటివరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలు అమలు చేయాలని సూచించింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ ఇటీవల ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నంకు రూ.2.48 కోట్లు, పట్టిసీమకు రూ.1.90 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఎన్జీటీ సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపడతామని ధర్మాసనం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news