లోన్ యాప్స్ టార్చర్ పై ఏపీ డీజీపీకి టీడీపీ లేఖ

-

ఏపీ లో లోన్‌ యాప్స్‌ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ డీజీపీ కసిరెడ్డి లేఖ రాశారు టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి. ప్రజలకు ఉరితాళ్లుగా మారిన ఆన్‌లైన్‌ రుణ యాప్‌లను బ్యాన్ చేయాలని కోరుతూ లేఖ రాశారు టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి.

రుణాల పేరిట అమాయకుల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. యాప్‌ల బారిన పడి రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి. ఆర్‌బీఐ అనుమతి లేకుండా రాష్ట్రంలో యధేచ్ఛగా ఆన్‌లైన్‌ రుణ యాప్‌ల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని.. ఆన్‌లైన్‌ రుణ యాప్‌లపై బ్యాన్‌ విధించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news