తెలుగు దేశం గొప్ప పార్టీ..ఆ పార్టీని నేనెప్పుడూ తిట్టలేదు: వల్లభనేని వంశీ

-

తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని, తాను ఎప్పుడూ ఆ పార్టీ ని తిట్టలేదు అని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. నారా లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే విమర్శలు చేశారని స్పష్టం చేశారు. హనుమాన్ జంక్షన్ లో జిపిఎల్ క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఆయన గన్నవరం వైకాపా నేత దుట్టా రామచంద్ర రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

పార్టీలో కొందరు వ్యక్తులు తన మీద ఆరోపణలు చేస్తున్నారని, తనతో కలసి పనిచేసే వాళ్ళను కలుపుకొని పోతానని స్పష్టం చేశారు. తన స్థాయి కానీ వారు కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వార్డు మెంబర్ గా గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు వంశీ. మట్టి అమ్ముకునే ఖర్మ తనకు పట్టలేదని తేల్చిచెప్పారు. అక్రమ మట్టి తవ్వకాల పై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news