పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులు పెట్టుకుంటున్నారు..టీడీపీ ఇక ప్యాకప్ : తమ్మినేని

-

పొట్టలో కత్తులు పెట్టుకుని పొత్తులు పెట్టుకుంటున్నారు..టీడీపీ ఇక ప్యాకప్ అని ఎద్దేవా చేశారు స్పీకర్ తమ్మినేని. పొలిటికల్ ఫిలాసఫీ తో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు… అందుకే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పిల్లల విద్యా కోసం నాడు నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారు…గతంలో జన్మ భూమి కమిటీలు ఇచ్చినదే ఫైనల్ లిస్ట్ అన్నారు.

ఇప్పుడు అ పరిస్థితి లేదు… పూర్తి పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది…గ్రామంలో పరిపాలన ఉండాలనే, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి పాలనను డీసెంట్రలైజ్ చేశారని వెల్లడించారు. ఎందరు కలిసినా జగన్ మోహన్ రెడ్డి ని ఎదుర్కొలేదు…గడపగడపకు మన ప్రభుత్వంలో అందరూ పాల్గొంటున్నారు… ప్రజల మద్దతు లభిస్తుందని చెప్పారు.

ప్రజలు సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు…పాలసీ లేకుండా .. విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టున్నట్టేనన్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీని చంద్రబాబు, అశోక్ వాల నాయకులూ సమర్ధిస్తారా అని అడుగుతున్నా….
మాల్ ప్రాక్టీసును మీరు సమర్ధిస్తున్నారా… సూటిగా చెప్పండని డిమాండ్ చేశారు. చట్టం తన పని తను చేస్తుంది… విచారాణ జరిపి చర్యలు తీసుకుంటారు…ఎంత మంది జీవితాలో వీళ్లు ఆడుకుంటూ..‌.రాజకీయ మధ్యవర్తి లేకుండానే పథకాలన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news