రాష్ట్రంలో క్రైమ్ పెరగడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం – ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

-

తూర్పుగోదావరి జిల్లా: వైసిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్నారకాసుర, అవినీతి నిరోధక రక్షిసుడు జగన్ అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (బాబాయ్) హత్య కేసు నుండి తమ్ముడిని కాపాడుకోనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందన్నారు బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు పర్యటనలో భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవినీతి అధికారులను పెట్టుకుని దుర్మార్గ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోవడానికి వైసిపి ప్రభుత్వమే కారణం అన్నారు బుచ్చయ్య చౌదరి. ఈ ప్రభుత్వం పతనం కావడం దగ్గరపడిందన్నారు. జగనన్న కోడి కత్తి నాటకంలో వారి అనుచరుల ప్రమేయం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ గాలిలో తిరుగుతున్నారని.. వర్షాలకు పంటలు నీట మునిగినా పట్టించుకోరా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news