చంద్రబాబును మించిన 420 మరొకరు ఉండరు : సజ్జల

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మరోసారి ఫైర్ అయ్యారు. ఏపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనకు తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబుకి ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ని తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ఏపీ మరో శ్రీలంక అవుతుందని గగ్గోలు పెట్టి ఎన్నికలు రాగానే ఫ్రీ స్కీమ్ లు ప్రకటిస్తున్నారని చురకలంటించారు సజ్జల. 

చంద్రబాబు హయాంలో విజయవాడ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. నాశనం చేయడంలో చంద్రబాబుకి ప్రపంచ రికార్డు ఇవ్వవచ్చని సెటైర్లు వేశారు సజ్జల. చంద్రబాబుని మించిన 420 ఎవ్వరు ఉండరని.. అమరావతి పేరుతో 3వేల ఎకరాలను జేబులో పెట్టుకున్నారని మండిపడ్డాల సజ్జల. జనాన్ని ముంచే రియల్టర్ గా చంద్రబాబు మారారు అని.. ఆయన హయాంలో ప్రజల జీవితాలు చీకటి మయం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన బ్రోకర్ల కోసం కృష్ణా జిల్లాను తాకట్టు పెట్టారని సజ్జల ఆరోపించారు. జనానికి జ్ఞాపక శక్తి లేదని చంద్రబాబుకి అపారమైన నమ్మకం అని పేర్కొన్నారు. చంద్రబాబుకి దత్త, సొంత కొడుకులు 2014 నుంచి 2019 మధ్యలో ఏం చేశారో చెప్పుకోలేక.. ఏం చేస్తారో కొత్తగా చెప్పుకుంటున్నారని చురకలు అంటించారు సజ్జల. 

Read more RELATED
Recommended to you

Latest news