ఇది ప్రభుత్వ నిర్లక్యం కారణంగా వచ్చిన ముప్పు.. పిఠాపురం లో జగన్

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో ఇవాళ మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఏలేరు  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన.. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేటలో వరద బాధితులను  కలిసిన ఆయన.. అక్కడి ప్రజల అవస్థలను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ వైఎస్సార్సీపీ  అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ.. పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైందని, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందనే విషయాన్ని ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ఘోర విపత్తు సంభవించిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news