రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం – చంద్రబాబు

-

ప్రజలు కళ్ళు తెరవాలని.. లేదంటే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏలూరు లోని పెదవేగి మండలం విజయరాయి లో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. నాకు కాదన్నారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

ఇదేం కర్మ కార్యక్రమం ప్రారంభిస్తానని టిడిపి అంటే.. లండన్ బాబు దెందులూరులో హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. లండన్ బాబుని శాశ్వతంగా లండన్ కే పంపిస్తానని.. ఎవరితో పెట్టుకుంటున్నావో మర్చిపోకని హెచ్చరించారు. మరోసారి ఈ ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదన్నారు. గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చారు, కోడి కత్తి డ్రామా ఆడారని అన్నారు. సీఎం జగన్ పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేయిస్తున్నాడని ఆరోపించారు.

వైయస్ వివేకా కేసు సుప్రీంకోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకి వెళ్లడం జగన్ కి చెంపపెట్టు అన్నారు చంద్రబాబు. కొత్తగా వచ్చిన మంత్రికి అసలు డయాఫ్రం వాళ్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో పోలవరాన్ని 72% పూర్తి చేశామన్నారు. జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేసారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news