ఏపీ ప్రజలకు శుభవార్త.. కొత్తగా రూ. 1000 కోట్ల పెట్టుబడులు

-

ఏపీ ప్రజలకు శుభవార్త. ఏపీకి కొత్తగా రూ. 1000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నిన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ జరిపారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం జగన్‌.. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు.

సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు ఏపీ సీఎం జగన్‌. ఇక తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రూ. 1000 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టనున్నారు త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా. రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు వరుణ్‌ గుప్తా. ఈ ప్లాంట్‌ వల్ల 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news