తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..ఎల్లుండి ఆ టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ ఒకటి నుంచి 22వ తేదీ వరకు రూ 300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అటు ఇవే తేదీలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోట టికెట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోట టికెట్లను విడుదల చేయనుంది.

కాగా, తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారికి దర్శనానికి భక్తులు.. 31 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. అటు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 72,650 మంది భక్తులు ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజు 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news