వైసీపీలో మళ్ళీ విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు ?

-

వైసీపీలో మళ్ళీ విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చారు సీఎం జగన్‌. వైసీపీలో గత కొన్ని రోజుల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి సైలెంట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలోకి వెళతారనికూడా ప్రచారం జరిగింది.

అయితే.. ఇలాంటి తరుణంలోనే… వైసీపీలో మళ్ళీ క్రియాశీలకమైన పాత్ర పోషించనున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఇందులో భాగంగానే.. ఇవాళ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అనుబంధ విభాగాల త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుబంధ విభాగాలను దిశానిర్దేశం చేయనున్నారు విజయసాయిరెడ్డి. ఈ మేరకు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news