“వ్యవసాయమే దండగ” అన్నవారు…గెలిస్తే ప్రతి రైతుకు ఏడాదికి 20 వేలు ఇస్తారా? – విజయసాయి

-

“వ్యవసాయమే దండగ” అన్నవారు…గెలిస్తే ప్రతి రైతుకు ఏడాదికి 20 వేలు ఇస్తారా? అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీపై విరుచుకుపడ్డారు. చాలా రోజుల తర్వాత.. తెలుగు దేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..విమర్శలు చేశారు.

మొన్న టీడీపీ పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోను ఉద్దేశించి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. “వ్యవసాయమే దండగ” అన్నవారు…గెలిస్తే ప్రతి రైతుకు ఏడాదికి 20వేలు ఇస్తారా? ఆహా! ఏమి ‘మాయాఫెస్టో’! అంటూ చురకలు అంటించారు. అధికారంలో ఉండగా…బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారు అన్నవారు, బీసీల తోకలు కత్తిరిస్తామన్నవారు, ఇప్పుడు గెలిస్తే బీసీల రక్షణకు చట్టం చేస్తారా? ఆహా! ఏమి ‘మాయాఫెస్టో’!అంటూ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news