స్విగ్గీ ని బాయ్ కాట్ చేయాలని విజయవాడ హోటల్స్ నిర్ణయం..!

-

స్విగ్గీ ని బాయ్ కాట్ చేయాలని విజయవాడ హోటల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు. ఆర్. వి. స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు ఈ విషయంపై మాట్లాడుతూ.. ఈనెల 14 నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలివేశాం. రాష్ట్రంలోని అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం. స్విగ్గీ .జుమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27న ముడు దఫాలుగా స్వీగ్గీ, జుమాటో ప్రతినిధులతో చర్చించాం.

తమ అభ్యంతరాలను జుమాటో కొంతవరకు అంగీకరించింది.. స్వీగ్గీ కాలయాపన చేస్తూ వస్తుంది. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల ఈనెల 14 వ తేదీ నుంచి స్విగ్గీ బాయ్ కాట్ చేస్తున్నాం. స్విగ్గీ, జుమాటోకు సహకరించేందుకు మేము సిద్దంగానే ఉన్నాం. నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని కోరుతున్నాం. క్రేజీ ప్యాకేజీల పేరుతో తయారైన ఆహారం కంటే తక్కువ ధరకు విక్రయాలతో నష్టపోతున్నాం అని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version