వారికి తలంటు పోయిందే రెడ్డి గారికి నిద్ర పట్టదు గా ?

-

కాలేజీ ల్లోనూ, రోడ్లపైనే జరిగే ర్యాగింగ్ ఒకరకంగా ఉంటుంది. కానీ పొలిటికల్ గా జరిగే ర్యాగింగ్ చూస్తే ఆ కిక్కే వెరబ్బా..! ఆ కిక్కు ఏ విధంగా ఉంటుందో స్వయంగా చూపిస్తున్నాడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. నిత్యం సరికొత్త రీతిలో ర్యాగింగ్ చేస్తూ, కేక పుట్టిస్తున్న తీరుతో వైసీపీ రాజ్యసభ సభ్యులు గగ్గోలు పెట్టేస్తున్నారు. ప్రధానంగా, టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇద్దరిని ఓ ఆట ఆడే ఉంటారు విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అక్రమాలు, వ్యవహారాలతో పాటు, ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిణామాల దగ్గర నుంచి వేటినీ వదిలిపెట్టకుండా, అన్నిటినీ వాడేసుకుంటూ వస్తున్నారు.
లోకేష్ చంద్రబాబు ఏ విషయం పైన అయినా స్పందించి పార్టీ పైన , జగన్ పైన కానీ, విమర్శలు చేస్తే ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేసేందుకు అందరికంటే ముందుగా విజయసాయిరెడ్డి తెరపైకి వస్తూ ఉంటారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక ప్రత్యేకత ఉండడంతో, ఆయన విమర్శలు ఇంతగా హైలెట్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న సోషల్ మీడియా ట్రెండ్ ను చాలా చక్కగా ఉపయోగించుకుంటూ, చంద్రబాబు లోకేష్ ఇద్దరి ని టార్గెట్ చేసుకుంటూ, విజయసాయిరెడ్డి చెడుగుడు ఆడుకుంటూ వస్తున్నారు. తనదైన శైలిలో పంచ్ డైలాగులు పేల్చుతూ, తండ్రి కొడుకులు ఇద్దరిని తిట్టిపోస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయిన చంద్ర బాబు లోకేష్ తీరుపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
పెదరాయుడు తండ్రి కొడుకులు  తప్పి పోయారని, వారిని బలవంతంగా వ్యాన్ ఎక్కించి  మా రాష్ట్రానికి పంపించండి అంటూ వ్యంగ్యంగా అస్త్రాలు సందించడం ఒక్క విజయసాయిరెడ్డి కే చెల్లింది. మరో సందర్భంలో టీడీపీ నుంచి బీజేపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది టీడీపీ నాయకులను ఉద్దేశించి,  ఏడాది కాలంగా తినడానికి ఏమీ లేని టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే ఆ మిడతలు మీ పార్టీలో చేరి విధ్వంసం సృష్టించిన విషయం గ్రహించే లోగానే మిగతావి ఎగురుకుంటూ బయలుదేరాయి అంటూ విమర్శించినా, అది విజయసాయి కే చెల్లింది.ఇలా సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, లోకేష్ , చంద్రబాబు ఈ ఇద్దరినీ ఆడుకోవడం ఒక్కటే తమ ప్రధాన విధి అన్నట్టుగా విజయసాయి రెడ్డి సైరా పంచ్ లతో తండ్రి కొడుకులు ఇద్దరికీ తలంటు పోసేస్తున్నారు. అసలు ఆ తలంటు పోస్తే కానీ, నిద్ర పట్టదు ఏమో అన్నట్టుగా రెడ్డి గారి పంచ్ లు తండ్రి కొడుకులు ఇద్దరిపై  పేలిపోతున్నాయి. ఇప్పుడు అమరావతి వ్యవహారం పైనా అంతే స్థాయిలో లోకేష్ , చంద్రబాబు పై విమర్శలు సందిస్తున్నాడు విజయసాయిరెడ్డి.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news