కేంద్రం నిధులతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాం : సోము వీర్రాజు

-

కర్నూలు : కేంద్రం నిధులతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని.. సోము వీర్రాజు ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధం…సోము వీర్రాజు సవాల్ విసిరారు. వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ పై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇస్తుంది….చంద్రబాబు సీఎం గా, జగన్ ప్రతిపక్షనేతగా అస్సెబ్లీలో ప్రత్యేక ప్యాకేజీపై చర్చ జరిగింది…మరి ఇప్పుడు లబ్ది కోసమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారన్నారు.

ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజి తో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు జగన్ మాయలో పడి యూ టర్న్ తీసుకున్నారని వెల్లడించారు. 80 లక్షల ఇళ్లకు 32 వేల కోట్లు ఇచ్చామని.. ఉపాధి హామీ పథకం కింద 80 వేల రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని.. కర్నూలులో రైల్వే వ్యాగిన్ రిహాబిలిటేషన్ సెంటర్ త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సోము వీర్రాజు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news