మైనారిటీలపై ఎందుకంత కక్ష జగన్ రెడ్డి..? – నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మైనారిటీలపై ఎందుకంత కక్ష జగన్ రెడ్డీ?!.. అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. అర్థంతరంగా నిలచిపోయిన ఈ కళాశాల నిర్మాణమే ఇందుకు నిదర్శనం అన్నారు నారా లోకేష్.

ఆదోని నియోజకవర్గం ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్ధూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించిందని.. నిర్మాణపనులు కూడా ప్రారంభించామని కానీ.. వైసిపి ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను అంగుళం కూడా ముందుకు సాగనీయకుండా పాడుబెట్టారని మండిపడ్డారు. కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతగాదు… గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి! అంటూ తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news