ఐపిఎల్ 2023: పంజాబ్ “టాప్ ఆర్డర్” ఢమాల్ … !

-

ఐపిఎల్ 2023 లో ఈ రోజు పంజాబ్ మరియు బెంగళూరు జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఈ రోజు రెండు మ్యాచ్ లు ఉండడంతో క్రికెట్ ప్రేమికులు చాలా సంతోషం గా ఆస్వాదిస్తున్నారు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూర్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 174 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. కోహ్లీ మరియు డుప్లిసిస్ లు హాఫ్ సెంచరీ లతో రాణించడంతో ఆమాత్రం స్కోర్ అయినా చేశారు. మిగిలిన వాళ్ళు అంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు, కాగా 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆరంభంలోనే తుస్సుమనిపించింది.

పవర్ ప్లే లోనే 49 పరుగులకు 4 వికెట్లను కోల్పోయి ఓటమి బాటలు వేసుకుంది. ఓపెనర్లు అతర్వ త్వరగా ఔట్ అయినా ప్రభు సిమ్రాన్ సింగ్ మాత్రం జట్టును కొంచెం ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు.. ఈ ప్రయత్నంలో భాగంగా 46 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. లివింగ్ స్టన్, షార్ట్ , కరాన్, భ్రార్, షారుఖ్ ఖాన్ అందరూ మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో పంజాబ్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడమే ఈ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది. శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో భారం అంతా కుర్రాళ్లపైనే పడింది. మరి చూద్దాం ఈ మ్యాచ్ ఎలా ముగియనుందో ?

Read more RELATED
Recommended to you

Latest news