ఎల్లుండి 700 మంది AEEలు, 1800 మంది లష్కర్స్ కి సీఎం చేతుల మీదుగా నియామకప్రతాలు

-

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన నియామక ప్రక్రియలను పూర్తి చేయడంతో పాటు కొత్తగా నోటిఫికేషన్ల జారీ చేసి ముందుకెళ్తోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు  2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఇప్పటికే 34వేల కొత్త నియామకాలు పూర్తి చేయగా.. అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేసింది.

కొత్తగా నీటి పారుదల శాఖలో ఖాళీల భర్తీకి సిద్ధమైంది. కొత్తగా నియమితులైన 700 ఏఈఈలకు, 1800 మంది లష్కర్ లకు ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఎర్రమంజిల్ జలసౌధ వేదికగా ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకనటలో
తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version