పసుపు మీడియా పనితనం ఇలా బూమరాంగ్ అవుతుంది!

-

జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది.. మరో మూడన్నరేళ్లు ఉంది అనుకుందాం! అప్పటివరకూ కూడా ఆగేలా లేరు టీడీపీ & వారి అను”కుల” మీడియా! ఏపీలో ఏమి జరిగినా దాన్ని బూతద్దంలో చూపించడం జరుగుతుంది. రాజకీయ నిరుద్యోగులు కొందరిని తీసుకొచ్చి డిబెట్ల మీద డిబేట్లు పెడుతుంది! మరి ఇది జగన్ కు మైనస్సా… బాబుకు బూమరాంగా అన్నది ఇప్పుడు చూద్దాం!

ప్రజావేదిక కూల్చివేత మొదలు అనంతరం అమరావతి ఉద్యమం, తర్వాత అంతర్వేది ఉద్యమం.. మధ్య మధ్యలో కోర్టు తీర్పులు.. తిరుమలలో జగన్ డిక్లరేషన్ వరకూ ఎల్లో మీడియా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు!! ఉన్నది ఉన్నట్లు చూపించలేరు.. పరిధులు దాటిన ఊహలు, వాటి ప్రతిరూపాలైన కథనాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది! ఇంతకూ వారి అత్యుత్సాహం జగన్ కు ఎలా ప్లస్ అవుతూ వస్తుందనేది ఇప్పుడు చూద్దాం!

ప్రజావేదిక కూల్చివేత, అమరావతి ఉద్యమాల లెక్కలు, జరుగుతున్న విధానాలు అందరికీ తెలిసినవే!! ఈ క్రమంలో నేడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే కోర్టు తీర్పులను మొట్టికాయలుగా అభివర్ణిస్తోన్న పసుపు మీడియా కథనాలు కూడా… ప్రజల్లో జగన్ పై సానుభూతినే కలిగించడం మొదలుపెట్టాయి! ఇదే సమయంలో తిరుమల డిక్లరేషన్ విషయంలో జగన్ ని ఇరుకునపెట్టడానికి వారు పడిన తాపత్రయం అంతా… బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది!

ఇవన్నీ చూస్తుంటే… చంద్రబాబు తాను భాగ్యనగరంలోనే తలదాచుకుంటూ పూర్తిగా ఎల్లోమీడియాపై ఆధారపడి ఏపీలో ఈ జనరేషన్ లో రాజకీయాలు చేసేద్దామని.. అధికారంలోకి వచ్చేద్దామని కలలు గనడం వల్ల.. ఫలితాలు ఊహకందనంత దారుణంగా ఉంటాయన్న విషయాన్ని బాబు & కో గ్రహించాలని అంటున్నారు విశ్లేషకులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news