సీఎం జగన్ పై దాడి… షర్మిల సంచలన పోస్ట్

-

సీఎం జగన్ పైకి రాయి విసిరారు ఆగంతకులు. ఈ తరుణంలోనే సీఎం జగన్‌ ఎడమ కంటికి గాయం అయింది. విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది. రాయి బలంగా తగలడంతో ఎడమ కన్ను వాచింది.. ప్రాథమిక చికిత్స అనంతరం బస్సు యాత్ర కొనసాగుతోంది.

ys sharmila reacts on Attack On CM Jagan

అయితే.. సీఎం జగన్‌ పై జరిగిన దాడిపై వైఎస్‌ షర్మిల స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం అన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నామని… అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందేనని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని షర్మిల పోస్ట్‌ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news