YSR అభిమానులకు వైఎస్ షర్మిల 3 పేజీల బహిరంగ లేఖ

-

APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. YSR అభిమానులకు వైఎస్ షర్మిల 3 పేజీల బహిరంగ లేఖ రాశారు APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాదని తెలిపారు. అమ్మ వైఎస్ విజయమ్మ గారు, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక పుస్తకం రాశారు.

ys sharmila on cm jagan mohan reddy
YS Sharmila released a three-page open letter

అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. “రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే”, తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారని వెల్లడించారు.. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. “నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం”. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే.

Image

అవి జగన్ మోహన్ రెడ్డి గారి సొంతం కాదని తెలిపారు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు “గార్డియన్ ” మాత్రమే. అన్నీ వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి గారి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికి,స్పష్టంగా తెలిసిన విషయం అన్నారు.

Image

Image

Read more RELATED
Recommended to you

Latest news