ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్.. నేడు వైఎస్ఆర్ లా నేస్తం ఆర్థిక సాయం

-

ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్.. నేడు వైఎస్ఆర్ లా నేస్తం ఆర్థిక సాయం విడుదల చేయనుంది జగన మోహన్ రెడ్డి సర్కార్. క్రితం ఏడాది లాగే ఇవాళ వైయస్సార్ లా నేస్తం పథకం కింద ఆర్థిక సాయం విడుదల చేయనుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2677 మంది యువ లాయర్ల ఖాతాలలో నెలకు 5000 రూపాయల స్టయిఫండ్ విడుదలలో భాగంగా తొలివిడతను సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలలో జమ చేయనున్నారు. ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మాసం వరకు ఏకంగా 25 వేల రూపాయల చొప్పున అందిస్తారు. కొత్తగా లాగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు వృత్తిలో నిలదొక్కుకునేలా… మూడేళ్లపాటు ఏటా 60000 రూపాయల చొప్పున… ప్రభుత్వం రెండు విడతల లో సహాయం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news