BREAKING : కరీంనగర్‌లో మరో పాజిటివ్‌

-

మొన్న ఇండొనేషియా వచ్చిన బృందంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో నేటికి పాజిటివ్‌ కేసులు 27కు పెరిగాయి.నిజానికి ఈ వ్యక్తిని ఆదేరోజు పోలీసులు అరెస్ట్‌ చేయగా, మూడురోజుల క్రితం బెయిల్‌పై విడుదలై మళ్లీ జనంలోకి వచ్చాడు. ఈరోజు అతన్ని వెతికి పట్టుకుని పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ మూడు రోజులు అతను ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరెవరిని కలిసాడో ప్రభుత్వాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనతో కరీంనగర్‌ మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది.కాగా, తెలంగాణలో ఇది రెండో లోకల్‌ కాంటాక్ట్‌ కేసుగా నమోదయింది. హైదరాబాద్‌లో మొన్న దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా అతని కొడుక్కి సంక్రమించడంతో మొదటి కాంటాక్ట్‌ కేసుగా నమోదయింది.

Read more RELATED
Recommended to you

Latest news