BREAKING : తెలంగాణలో మరో మెడికో విద్యార్థి ఆత్మహత్య

-

తెలంగాణలో మరో మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ హాస్టల్ గదిలో ఉరేసుకుని, బలవన్మరణానికి పాల్పడ్డాడు. సనత్ పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కాగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ ఆమెను ర్యాగింగ్‌ చేసినట్లు పోలీసుల ఎదుట ఎట్టకేలకు ఒప్పుకొన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 22న ప్రీతి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్లడం, తర్వాత నిమ్స్‌కు తరలించగా.. ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news