వైసీపీ వైపు చూస్తున్న మరో టీడీపీ ఎమ్మెల్యే…!

-

టీడీపీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ కొట్టారు. కానీ పారిశ్రామిక వేత్త కావడం వ్యాపారంలో చిక్కులు ఎదురుకావడంతో మండపేట టీడీపి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పక్కచూపులు చూస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎప్పుడూ దూకుడుగా వెళ్లలేదు. .. ఆ సంఘటనలను ఉటంకిస్తూ వేగుళ్ల వైసీపీలో చేరిపోతారనే ప్రచారం మొదలైంది.

ఇప్పుడు కాకపోతే ఎన్నికల సమయానికైనా వేగుళ్ల వైసీపీ గూటికి వచ్చేస్తారని అనుకుంటున్నారట. ఆర్థిక, అంగ బలం కలిగిన ఆయన వస్తానంటే వైసీపీ పెద్దలు కూడా కాదనరని ఎవరికి వారు చెవులు కొరుక్కుంటున్నారు. అప్పుడే వేగుళ్లే మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మండపేట వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న తోట త్రిమూర్తులు పరిస్థితి ఏంటి? అటు రామచంద్రపురం లేక ఇటు మండపేట చేజారిపోతే తోట ఏం చేస్తారన్న దానిపై చర్చ మొదలైందట. మరి.. మండపేట రాజకీయాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news