రేపల్లె లో మరో దారుణ ఘటన..ట్యూషన్ కి వెళ్ళిన విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

-

రేపల్లెలో మరో దారుణ ఘటనన చోటుచేసుకుంది.ట్యూషన్ కి వెళ్ళిన విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని నిందితుడిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె లో చోటుచేసుకుంది.రేపల్లె లోని 19 వ వార్డు కు చెందిన ఇసుకపల్లి లో మోపిదేవి శివకుమార్ ( బాబి) ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.ఈ ట్యూషన్ సెంటర్ లో బాలిక చేరింది.గత ఆరు నెలల నుండి శివ కుమార్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ వేధింపులు భరించలేక తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది.ట్యూషన్ కు వచ్చిన విద్యార్థులను బయట కూర్చోబెట్టి తనను మాత్రం గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని బాధితురాలు ఆరోపించింది.ఈ విషయమై ఇంట్లో చెబితే మార్పింగ్ ఫోటోలతో తనను బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news