ఆ హీరోయిన్ సెట్‌లో ఉంటే ఏఎన్ఆర్ భయపడేవారు.. ఎందుకో తెలుసా?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లలా ఎన్టీఆర్, ఏఎఆర్‌ను అభివర్ణిస్తుంటారు. చిత్ర సీమలో దిగ్గజాలుగా పేరు గాంచిన వారిరువురు కలిసి పలు సినిమాలు చేశారు. ఇక ఇద్దరి వ్యవహార శైలికొస్తే మాత్రం కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఎన్టీఆర్ సెట్ లో చాలా గంభీరంగా ఉండేవారు. కాగా, ఏఎన్ఆర్ మాత్రం చాలా సరదాగా ఉండేవారు.

హీరోయిన్స్ తో జోక్స్ వేస్తూ అలా సరదాగా ఉండే వారు ఏఎన్ఆర్. ఇక పాటలకు డ్యాన్స్ చేసే విషయంలో ఏఎన్ఆర్ తన కంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఏర్పరుచుకున్నారు. ఒకరకంగా హీరోయిన్ల ఫేవరెట్ హీరో ఏఎన్ఆర్ అని అప్పట్లోనే అనుకునేవారట. కాగా, అందరూ హీరోయిన్లతో ఏఎన్ఆర్ చాలా సరదాగా ఉంటారు. కాగా, ఓ స్టార్ హీరోయిన్ తో సెట్ లో షూటింగ్ చేస్తున్నపుడు మాత్రం ఏఎన్ఆర్ భయపడేవారట. ఆ హీరోయిన్ ఎవరో? ఆయన ఎందుకు అలా భయపడేవారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఎన్ఆర్ సరసన హీరోయిన్లుగా చాలా మంది నటించారు. మహా నటి సావిత్రి, జమునతో పాటు అందరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సెట్ లో హీరోయిన్లను నాగేశ్వరరావు ఆట పట్టిస్తుంటారు. అలా సెట్ లో హీరో, హీరోయిన్ ల మధ్య సందడి వాతావరణం ఉండేది. కాగా, సహజ నటి జయసుధ సెట్ లో ఉంటే మాత్రం తనకు భయం ఉంటుందని ఏఎన్ఆర్ అన్నారని ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

జయ సుధ నటన గురించి ఏఎన్ఆర్ చాలా గొప్పగా చెప్పారని తెలిపారు. జయసుధపై సింగిల్ షాట్స్ తీస్తున్నపుడు ఆమె పలికే హావ భావాలను మనం గమనించుకోకపోతే తర్వాత ఇద్దరిపైన షాట్స్ తీస్తే కనుక హీరో తేలిపోతాడని ఏఎన్ఆర్ చెప్పారని గుర్తు చేశాడు. సహజ నటి జయసుధతో అలా ఏఎన్ఆర్ పోటీ పడి మరి నటించేవారని ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఎదుటి నటి తాలూకు ప్రతిభను గుర్తించి అందుకు భిన్నంగా ఉండేందుకు అలా ఏఎన్ఆర్ ప్రయత్నించేవారు. ఇక ఏఎన్ఆర్ నట వారసులుగా ఆయన తనయుడు నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్ , సుమంత్ లు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి అందరికీ తెలుసు.

Read more RELATED
Recommended to you

Latest news