లైగర్ మూవీ స్టోరీ ని ఇంతమంది స్టార్ హీరోలు ఛీ కొట్టారా! పాపం విజయ్ దేవరకొండ పరిస్థితి ఏమిటి ?

-

దేశంలో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ సినిమా..పూరి జగన్నాథ్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ మరియు దర్శకత్వం వహించిన సినిమా ఇది..టీజర్, ట్రైలర్ మరియు పాటలు కూడా యూత్ కి విపరీతంగా నచ్చడం తో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరిగాయి..బుక్ మై షో లో టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి..ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ నుండే 5 లక్షల డాలర్లు వసూలు చేయబోతుంది అంటే మాములు విషయం కాదు..ఎందుకంటే ఇప్పటి వరుకు ఇక్కడ స్టార్ హీరో సినిమా మినహా మీడియం రేంజ్ హీరో కి ఈ స్థాయి ప్రీమియర్ నంబర్స్ రాలేదు..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయిల షేర్ కి పైగానే కొల్లగొడుతుంది అని అంచనా.

ఇక ఈ సినిమాకి హిట్ టాక్ రావడం ఒక్కటే ఆలస్యం..ఒకవేళ హిట్ టాక్ వస్తే అతి తేలికగా ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుంది..ఎందుకంటే విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది..ఈ మధ్య కాలం లో బాలీవుడ్ లో మన తెలుగు దబ్ సినిమాలు తెగ ఆడేస్తున్నాయి..లైగర్ సినిమా కి టాక్ వస్తే కేవలం బాలీవుడ్ నుండే ఈ సినిమా వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల రూపాయలకు జరిగింది..ఇది దాదాపుగా స్టార్ హీరో రేంజ్ బుకింగ్స్ అనే చెప్పొచ్చు..మరి ఇంత బిజినెస్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి..ఇవన్నీ పక్కన పెడితే లైగర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.

అదేమిటి అంటే ఈ సినిమాని తొలుత పూరి జగన్నాథ్ టాలీవుడ్ స్టార్ హీరో తో మాత్రమే చెయ్యాలి అనుకోని ఎంతో మంది స్టార్స్ కి వెళ్లి ఈ కథ వినిపించాడట..వాళ్లల్లో ప్రభాస్ , ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ఉన్నారు..ప్రభాస్ ఈ సినిమా చెయ్యడానికి తొలుత ఒప్పుకున్నప్పటికీ ,ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ రావడం తో ఈ స్క్రిప్ట్ ని పక్కనపెడుతూ వచ్చాడు..ఇక ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ లకు కూడా ఈ కథ వినిపించగా వాళ్ళు కూడా చూద్దాం చూద్దాం అంటూ పూరి జగన్నాథ్ ని బాగా వెయిట్ చేయించారు..ఈ గ్యాప్ లోనే పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు..పూరి తదుపరి చిత్రానికి ఫైనాన్స్ చెయ్యడానికి కూడా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు ముందుకు వచ్చాయి..ఇక ఇదే సమయం అనుకొని పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్న లైగర్ కథని విజయ్ దేవరకొండ తో తీసాడు..సినిమా అద్భుతంగా వచ్చింది అంటూ ఇండస్ట్రీ లో ఉన్నవారు చూసి చెప్పడం తో పూరి జగన్నాథ్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది అట..మరి ఆయన ఆనందానికి ఎలాంటి బ్రేక్స్ పడకుండా రేపు లైగర్ విడుదల అయ్యాక ప్రేక్షకుల నుండి హిట్ టాక్ రప్పించుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news