AP: జగన్ కొత్త మంత్రివర్గంలో మంత్రులు వీరే…

-

ఆంధ్ర ప్రదేశ్ కొత్త మంత్రి వర్గం పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. జగన్ మంత్రి వర్గంలో మొత్తంగా 25 మంత్రి వర్గంలో బెర్తులను ఖరారు చేసుకున్నారు. మంత్రి వర్గం ఏర్పాటులో సస్పెన్స్ కు తెరపడింది. కొత్త మంత్రి వర్గంలో గుడివాడ అమర్నాథ్, పి. రాజన్న దొర, ధర్మాన ప్రసాద్ రావు, సిదిరి అప్పల్రాజు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, బీ. ముత్యాల నాయుడు, మెరుగు నాగార్జున, విడదల రజిని, కాకాని గోవర్థన్ రెడ్డి, అంజాద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నారాయణ స్వామి, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్ర రెడ్డి, జయరామ్, ఆదిమూలపు సురేష్, ఉషా శ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, పిని విశ్వరూప్, తానేటి వనిత, కే. నాగేశ్వర్ రావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్ లకు జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కింది. పాత క్యాబినెట్ నుంచి 9 మందికి అవకాశం లభించింది. సామాజిక సమీకరణాల ప్రకారం, జిల్లా ప్రాతినిథ్యం, సమర్థత, సినియారిటీని ఆధారంగా చేసుకుని మంత్రి వర్గం కూర్పు ఉంది.

సామాజిక వర్గాలుగా చూస్తే బీసిలకు -10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనారిటీ-1 మంత్రులు ఉండనున్నారు.

జిల్లాల వారీగా మంత్రులు వీరే:

శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు
విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ, రాజన్నదొర
విశాఖపట్నం: గుడివాడ అమర్నాధ్, ముత్యాలవాయుడు
తూర్పుగోదావరి: దాడిశెట్టి రాజా,విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
పశ్చిమగోదావరిః తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ

కృష్ణా: జోగి రమేష్
గుంటూరు జిల్లా: అంబటి రాంబాబు,మేరుగ నాగార్జున, విడదల రజినీ
నెల్లూరు: కాకాణి గోవర్ధర్ రెడ్డి
కడపః అంజాద్ భాషా
కర్నూల్ : గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు: పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా
అనంతపురం: ఉషశ్రీ చరణ్,

ప్రకాశం: ఆదిమూలపు సురేష్

 

Read more RELATED
Recommended to you

Latest news