ఏపీలో బీజేపీని పైకి లేపడానికి కదిలొచ్చిన మాజీ సీఎం !

-

ఏపీలో ప్రస్తుతం టీడీపీ మరియు వైసీపీ లు తప్ప మరేతర ప్రధాన పార్టీలు లేవని చెప్పాలి, ఉన్న వాటికి ప్రజాధారణ తక్కువే అని నిస్సందేహంగా చెప్పాలి. కాగా తాజాగా బీజేపీ రస్తా అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ అభివృద్ధి దృష్ట్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగింది. కాంగ్రెస్ లో రెగ్యులర్ నాయకుడిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రత్యేక రాష్ట్రము తర్వాత ఏపీలో జైసమైక్యాంధ్ర అంటూ ప్రజల ముందుకు వచ్చినా ఆదరించలేదని తెలిసిందే. తాజాగా ఏపీలో బీజేపీతో కలిసి అడుగులు వేయడానికి సిద్ధం అయ్యాడు. అందులో భాగంగా ఈ భేటీలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం సలహాల మేరకు రాష్ట్రంలో ఎక్కడ పనిచేయమని కోరినా సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు.

ఇప్పటి వరకు ఏపీలో బీజేపీ చేసింది ఏమీ లేదు, ఇపుడు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ని ఏమి లేపుతాడో చూడాలి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news