ఏపీ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

-

కరోనా కట్టడి, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కరోనా నేపధ్యంలో మంత్రులంతా భౌతిక దూరం పాటిస్తూ ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల కోసం అమలు చేయాల్సిన ‘వైఎస్‌ఆర్ చేయూత’ పథకంపై ఈ భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా చిరు వ్యాపారులకు సర్కారు సాయం చేసే పథకం అలాగే రాష్ట్రంలో తీసుకురావాలనుకుంటోన్న మూడు ముఖ్యమైన సవరణ బిల్లుల ముసాయిదాలపై కూడా చర్చిస్తారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్రంలో కోరోనా తీవ్రత పేరుగుతుండటంతో, దాని కంట్రోల్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకొనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news