ఏపీలో కొత్తగా 2068 కరోనా కేసులు, 22 మరణాలు

-

ఏపీ లో గతంలో కంటే ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2068 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,61,222 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 21 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,354 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,198 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,29,565 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 80, 641 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,44, 84, 051 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 2127 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news