ఏపీ కరోనా అప్డేట్… కొత్తగా 1,393 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కేసులు.. ఇప్పుడు పెరుగుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త తగ్గాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1393 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,36,179 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 08 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 052 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 797 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1296 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 60, 350 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,75, 96, 989 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,07, 330 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news