కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా వ్యాపిస్తుంది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. . దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. గత 24 గంటల్లో 24,451 శాంపిళ్లను పరీక్షించగా మరో 439 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,059 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 8,929 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 3,599 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,354 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 106 కి చేరింది.
24 గంటల్లో ఏపీలో ఎన్ని కేసులంటే..!
-
Next article
Read more RELATEDRecommended to you
140 పైగా అసెంబ్లీ, 24 ఎంపీ…చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తాం – చంద్రబాబు
140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం.... చివరకు...
BREAKING: ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదు
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు బిగ్ షాక్ తగిలింది.బీజేపీ ఎంపీ...
రైతులు కష్టాల్లో ఉంటే… రేవంత్ రెడ్డి..ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు – కేటీఆర్
రైతులు కష్టాల్లో ఉంటే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.....సాగునీరు...