ఏపీలో కరోనా టెర్రర్.. ఒక్క రోజే 4955 కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 500లోపు కరోనా కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం…. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 4955 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

andhra-pradesh

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 509 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22870 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 397 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 64 , 331 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 35, 673 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 18 , 32, 010 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news