ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు, ఒక మరణం

-

ఏపీలో కరోనా కేసులు..క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 103 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77, 608 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 498 కి చేరింది.

carona ap
carona ap

ప్రస్తుతం రాష్ట్రంలో 1278 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 103 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 61 , 832 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 15 , 568 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 13, 97, 635 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news